కర్ణాటకలో పెను ప్రమాదం తప్పింది. ఉత్తర కన్నడ జిల్లాలోని కాళీ నదిపై నిర్మించిన బ్రిడ్జి ఒక్కసారిగా కూలిపోయింది. గత 6 నెలల్లో బ్రిడ్జి కూలిపోవడం ఇది రెండోసారి. గత ఆగస్టులోనే వంతెనకు మరమ్మతులు చేశారు. ఈ క్రమంలో ఆదివారం మళ్లీ కూలిపోయింది. బ్రిడ్జి కూలిపోయే సమయంలో దానిపైన ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.