థాయ్లాండ్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు కాలువలో పడిపోవడంతో 18 మంది అక్కడికక్కడే మృతి చెందారు. థాయ్లాండ్లోని ప్రాచిన్ బురిలో టూరిస్ట్ బస్సు అదుపు తప్పి కాలువలో పడిపోయింది. బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయినట్టు పోలీసులు తెలిపారు. సహాయక చర్యలు ముమ్మరం చేసినట్టు పేర్కొన్నారు.