ఝార్జండ్ రాష్ట్రంలోని లాతేహార్ వద్ద రాజ్యసభ ఎంపీ మహువా మాజీ కారు ప్రమాదానికి గురైంది. కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మెరుగైన చికిత్స నిమిత్తం ఆమెను రాంచీ రిమ్స్కు తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.