ప్రధాని మోదీ సారథ్యంలోనే కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుందని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ శిందే అన్నారు. బుధవారం ఢిల్లీకి విచ్చేసిన సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు. కేంద్ర కేబినెట్లో మంత్రి పదవి కోరుతున్నారా? అని విలేకర్లు ఆయన్ను ప్రశ్నించగా ‘ఏదో డిమాండ్ చేయడానికి నేనిక్కడికి రాలేదు. మోదీజీకి మద్దతుగా నిలిచేందుకే వచ్చా’ అని తెలిపారు.