హిందూ సాంప్రదాయంలో బాగంగా దేవుళ్ళకు చేసే పూజలో దీపం వెలిగించి, అటుపై మంగళ హారతి పడతారు. అయితే ఈ దీపం వెలిగించడంలో కొన్ని నిబంధనలు పాటిస్తే శుభం కలుగుతుంది. దీపపు కుందులు పరిశుభ్రం చేసుకోవాలి. పూజ ముగిసే లోపు దీపం ఆరిపోకుండా చూసుకోవాలి. పూజ చేస్తున్నప్పుడు పూజ దీపం మినహా ఏ ఇతర దూపం దీపం వెలిగించరాదు. నెయ్యి దీపం వెలిగిస్తే, మరో నూనె దీపం వెలిగించకూడదు. పూజాస్థలంలో దీపాన్ని పడమర దిశలో పెట్టకూడదట.