ధోనీ బ్యాటింగ్ ఆర్డర్లో ముందు వచ్చి ఉంటే చెన్నై సూపర్ కింగ్స్ గెలిచి ఉండేదని ఆ జట్టు మాజీ ప్లేయర్ షేన్ వాట్సన్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో ధోనీ తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చారు. ఆఖరి ఓవర్లో రెండు సిక్స్లు, ఒక ఫోర్ కొట్టి చెన్నై ఫ్యాన్స్ను అలరించారు. ఈ మ్యాచ్లో ధోనీ మొత్తం 30 పరుగులు చేశారు. CSK ఆర్సీబీ చేతిలో 50 పరుగుల తేడాతో చిత్తు చిత్తుగా ఓడింది.