చింతపండు రసం తాగితే ఆరోగ్యానికి అనేక లాభాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. చింతపండులో విటమిన్ బి, సి, యాంటీఆక్సిడెంట్లు, మెగ్నీషియం, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. చింతపండు రసం తాగడం వల్ల మలబద్ధకం తగ్గుతుంది. ప్రేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండె సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. జీర్ణ సమస్యలు దరిచేరవు. శరీరంలో మంటను ఇది అరికడుతుంది. క్యాన్సర్, షుగర్తో సహా దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం నుంచి కాపాడుతుంది.