కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప లైంగిక దాడికి పాల్పడినట్లు లోక్సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయనపై పోక్సో కేసు నమోదు కాగా, ఇవాళ సీఐడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. యడియూరప్పను దాదాపు 3 గంటల పాటు అధికారులు ప్రశ్నించారు.