పరువు నష్టం కేసు.. విచారణకు సీఎం రేవంత్‌ గైర్హాజరు

61చూసినవారు
పరువు నష్టం కేసు.. విచారణకు సీఎం రేవంత్‌ గైర్హాజరు
సీఎం రేవంత్‌రెడ్డిపై పరువునష్టం కేసు విచారణ వాయిదా పడింది. పరువు నష్టం కేసు విచారణను నాంపల్లి కోర్టు అక్టోబర్‌16కు వాయిదా వేసింది. MP ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్‌ తమ పార్టీపై తప్పుడు ప్రచారం చేశారని ఆరోపిస్తూ బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు పరువు నష్టం కేసు వేశారు. ఈ కేసులో సెప్టెంబర్‌ 25వ తేదీన విచారణకు హాజరు కావాలని రేవంత్‌రెడ్డికి కోర్టు సమన్లు జారీ చేసింది. అధికారిక కార్యక్రమాల్లో తీరిక లేకుండా ఉన్నారని రేవంత్‌రెడ్డి న్యాయవాది కోర్టుకు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్