TG: బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు, బీఆర్ఎస్ నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. 'పిల్ల కాకులతో నాకెందుకు కానీ.. అసలైన వాళ్లనే రమ్మనండి. శ్రీరాం సాగర్ గురించి మాట్లాడదామా? నాగార్జున సాగర్ గురించి మాట్లాడదామా? ఏ ప్రాజెక్ట్ గురించి మాట్లాడదమో కేసీఆర్ చెప్పాలి' అని డిమాండ్ చేశారు.