తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో కుటుంబసభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన మనవడి పుట్టువెంట్రుకల మొక్కు చెల్లించేందుకు ఆయన తిరుమలకు వచ్చారు. అంతకు ముందు ఆలయ అధికారులు సీఎం రేవంత్కు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం పండితులు తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనాలిచ్చారు.