విద్యుత్ కొనుగోలుపై కమిషన్ విచారణ.. కోదండరాం, రఘు హాజరు

51చూసినవారు
విద్యుత్ కొనుగోలుపై కమిషన్ విచారణ.. కోదండరాం, రఘు హాజరు
గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోలు అంశంపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ కొనసాగుతోంది. మంగళవారం విద్యుత్ శాఖ అధికారి రఘు, ప్రొఫెసర్ కొదండరాం విచారణకు హాజరయ్యారు. విచారణ ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కాగా.. భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం, ఛత్తీస్ గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుపైనా జ్యుడీషియల్ కమిషన్ విచారణ చేపట్టింది. విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన వివరాలను రఘు అధికారులకు అందించారు.

సంబంధిత పోస్ట్