కాంగ్రెస్ పార్టీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ జమానాలో అంతా అవినీతి ఉండేదని, నిర్ణయాత్మక విధానాలు అమలు చేసే స్థితిలో కూడా కాంగ్రెస్కు లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అబద్ధపు వాగ్ధానాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు, మాఫియా, అపరాధులను రక్షించడమే కాకుండా కాంగ్రెస్ చేసిన అవినీతి రాజకీయం తమకు గుర్తు ఉందన్నారు. మోదీ వచ్చాక పదేళ్లలో అవినీతిని తొక్కి పెట్టి దేశాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు.