తెలంగాణలో కాంగ్రెస్ నేత దారుణ హత్య (వీడియో)

35969చూసినవారు
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేత దారుణ హత్యకు గురయ్యారు. రాజేంద్రనగర్‌లోని అసద్ నగర్ వద్ద శనివారం రాత్రి కాంగ్రెస్ పార్టీ కార్నర్ మీటింగ్ కోసం ఎదురుచూస్తున్న ఎండీ మక్బుల్ అనే వ్యక్తిని వెనుక నుంచి వచ్చిన అంజాద్ అనే వ్యక్తి ఒక్కసారిగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో అక్కడే కుప్పకూలిపోయిన మక్బుల్ ను ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో హత్య జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

సంబంధిత పోస్ట్