లోక్సభ ఎన్నికల వేళ పంజాబ్లో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. అసెంబ్లీలో చీఫ్ విప్ పదవికి కాంగ్రెస్ ఎమ్మెల్యే విక్రమ్జిత్ సింగ్ చౌదరి సోమవారం రాజీనామా చేశారు. జలంధర్ లోక్సభ స్థానం నుంచి మాజీ సీఎం చరణ్జిత్ చన్నీని అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది. దీనిని ఆయన వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ నిర్ణయంపై అసంతృప్తితో పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.