తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి.. తేలని విజయం

72చూసినవారు
AP: ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో విజయం ఖరారు కాలేదు. తొలి ప్రాధాన్యత ఓట్లలో PRTU అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడుకు 6,927 ఓట్లు రాగా, APTF, కూటమి అభ్యర్థి పి.రఘువర్మకు 6596 ఓట్లు, PDF అభ్యర్థి విజయ గౌరికి 5684 ఓట్లు వచ్చాయి. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో అభ్యర్థుల విజయాన్ని నిర్ణయించలేకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపునకు అధికారులు సిద్ధమయ్యారు.

సంబంధిత పోస్ట్