కుప్పకూలిన విమానం.. మృత్యుంజయుడు

60చూసినవారు
కుప్పకూలిన విమానం.. మృత్యుంజయుడు
బుధవారం నేపాల్‌లో జరిగిన విమాన ప్రమాదంలో 18 మంది మృతి చెందారు. ఈ ఘటనలో ఆ విమానాన్ని నడుపుతున్న పైలట్ మనీశ్ శాక్య మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ఆయనకు తీవ్ర గాయాలవ్వగా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా కాఠ్‌మండూ ఎయిర్‌పోర్ట్‌లో శౌర్య ఎయిర్‌లైన్ విమానం కూలిపోయేముందు ఓ కంటైనర్‌ను ఢీకొట్టింది. దీంతో కాక్‌పిట్‌ ఆ కంటైనర్‌లో ఇరుక్కుపోయింది. అందులో ఉన్న మనీష్ తీవ్రంగా గాయపడినప్పటికీ ప్రాణాలతో బయటపడ్డాడు.

సంబంధిత పోస్ట్