బైక్‌పై వెళ్తున్న వ్యక్తి జేబు నుంచి రూ.50 వేలు చోరి (VIDEO)

57చూసినవారు
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో షాకింగ్ సంఘటన జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం గౌరవ్ నామ్‌దేవ్ అనే వ్యక్తి తన తండ్రితో కలిసి బ్యాంక్‌కు వెళ్లి, రూ.50,000 డ్రా చేశాడు. తండ్రితో కలిసి బైక్‌పై ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. దీంతో వారిని అనుసరించిన దొంగ, ఆ వ్యక్తి జేబులో ఉన్న రూ.50 వేలు చోరీ చేశాడు. తన అనుచరుడితో కలిసి మరో బైక్‌పై పారిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్