రేపు ప్రధాని మోదీ సోషల్ మీడియా ఖాతాలను పూర్తిగా మహిళలే నిర్వహించనున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కొందరు స్ఫూర్తిదాయక వ్యక్తులకు ఈ బాధ్యతలు అప్పగించనున్నారు. ఇటీవల సూరత్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ ఈ విషయాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బుజ్జగింపులు లేకుండా కేవలం ప్రజల సంతృప్తి కోసమే తమ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రధాని మోదీ తెలిపారు.