తెలంగాణలో గాలివాన బీభత్సం

63చూసినవారు
తెలంగాణలో గాలివాన బీభత్సం
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిన్న పలుచోట్ల భారీ వర్షం కురిసింది. మెదక్, వరంగల్ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. గాలివాన ధాటికి చెట్లు నేలకొరిగాయి. దీంతో రహదారులపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ స్తంభాలు విరిగిపోవటంతో కరెంటు సరఫరా నిలిచిపోయింది. మెదక్ శివ్వంపేట మండలంలో చెట్టు కూలి ఇల్లు ధ్వంసమవగా, దొంతిలో సెల్ టవర్ కూలిపోయింది. ఈ ఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్