TG: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకున్నది. సైలో బంకర్ కాలుష్యంతో శ్వాసకోశ వ్యాధితో లక్ష్మీ నారాయణ మృతి చెందినట్లు ఆరోపిస్తూ సదరు గ్రామస్థులు మృతదేహంతో నేషనల్ హైవే పై ధర్నాకు దిగారు. ఇప్పటికే సైలో బంకర్ కాలుష్యంతో అనేక మంది మృత్యువాత పడ్డారని తెలిపారు. సైలో బంకర్ తోలగించాలంటూ డిమాండ్ చేశారు. హైవేపై దర్నాకు దిగటంతో ఇరువైపులా ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది.