ఆన్లైన్ గేమ్స్ తో డబ్బులు కోల్పోయిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా గంగాధరలోని మధురానగర్కు చెందిన పృథ్వీ(25) బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో యూపీలోని నోయిడాకు వెళ్లి స్నేహితులతో కలిసి ఉన్నాడు. ఆన్లైన్లో పరిచయమైన ముగ్గురు వ్యక్తులతో కలిసి గేమ్స్ ఆడుతూ రూ.12 లక్షలు పోగొట్టుకున్నాడు. దీంతో అప్పులు ఎలా చెల్లించాలో తెలియక శనివారం రాత్రి ఉరేసుకున్నాడు.