ఐపీఎల్ 2025లో తమ తొలి మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ నిర్దేశించిన 210 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ 19.3 ఓవర్లలో ఛేదించిన సంగతి తెలిసిందే. కాగా IPL చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి ఇదే అత్యధిక రన్ ఛేజ్. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఆల్ రౌండర్ అశుతోష్ శర్మ 31 బంతుల్లో అజేయంగా 66 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. అశుతోష్ తన ఇన్నింగ్స్లో 5 సిక్స్లు, 5 ఫోర్లు కొట్టారు.