విశాఖ స్టేడియంలో సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ను కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, సయ్యద్ అబ్దుల్ నజీర్, ఎంపీ కేశినేని చిన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ACA అధ్యక్షుడు కేశినేని చిన్ని విశాఖ స్టేడియం అభివృద్ధి అంశాలను కేంద్రమంత్రి రామ్మోహన్కు వివరించారు. లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో దిల్లీ ఒక్క వికెట్ తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.