'ఢిల్లీ జల్ బోర్డు CEOను సస్పెండ్ చేయాలి'

64చూసినవారు
'ఢిల్లీ జల్ బోర్డు CEOను సస్పెండ్ చేయాలి'
తాగు నీటి కోసం జరిగిన గొడవలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిందని, దీనికి బాధ్యుడైన ఢిల్లీ జల్ బోర్డు CEOను సస్పెండ్ చేయాలని రాష్ట్ర మంత్రి అతిషి డిమాండ్ చేశారు. దీనిపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ఆదివారం ఆమె లేఖ రాశారు. తూర్పు ఢిల్లీలో నీటి కొరత కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. నీటి కొరత ఏర్పడకుండా సీఎం కేజ్రీవాల్ ఏడాది ముందే స్పష్టమైన ఆదేశాలిచ్చినా, అధికారులు పట్టించుకోలేదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్