కర్ణాటక రాజధాని బెంగళూరు మహానగరంలో డెంగ్యూ వైరస్ విజృంభిస్తోంది. డెంగ్యూ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మే 1వ తేదీ నుంచి 13వ తేదీ వరకు బెంగళూరు నగరంలో ఏకంగా 172 డెంగ్యూ కేసులు వెలుగుచూసాయి. దీంతో నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. ఈ మేరకు బృహత్ బెంగళూరు మహానగర పాలక సంస్థ కమిషనర్ వికాస్ కిషోర్ వెల్లడించారు. డెంగ్యూ వైరస్ విస్తరించకుండా నివారణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.