రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో ఉన్న దర్గాను తొలగించాలంటూ కొందరు భక్తులు హుండీలో చీటీలు వేశారు. ఈ క్రమంలో "దర్గా హఠావో... వేములవాడ బచావో" అంటూ ఓ భక్తుడు చీటీలో రాశాడు. ఆలయ అధికారులు హుండీ లెక్కింపు చేపట్టగా ఈ చీటీలు బయటపడ్డాయి. దీంతో ఆ చీటీ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.