* పాంబన్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.535 కోట్లు ఖర్చయింది.
* ఈ బ్రిడ్జిలోని వర్టికల్ లిఫ్టును ఒక్క బోల్టు కూడా వాడకుండా వెల్డింగ్తోనే నిర్మించారు.
* బ్రిడ్జికి 99 పిల్లర్లు ఉన్నాయి. సముద్రం అడుగున గట్టి నేల తగిలే వరకు 25-35 మీ. లోతున పునాదులు వేశారు.
* ఈ వంతెన వచ్చే 100 ఏళ్ల వరకు పటిష్ఠంగా ఉంటుందని ఇంజినీర్ల అంచనా.
* గరిష్ఠంగా గంటకు 80 కి.మీ వేగంతో రైళ్లు వెళ్లొచ్చు.