ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) చరిత్రలో అత్యంత విజయవంతమైన భారత వికెట్ కీపర్ బ్యాటర్లలో దినేష్ కార్తీక్ ఒకడు. తమిళనాడుకు చెందిన కార్తీక్ 17 సుదీర్ఘ సీజన్లు ఆడిన తర్వాత ఐపీఎల్ కు గుడ్ బై చెప్పాడు. బుధవారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడిన అనంతరం కార్తీక్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. మైదానం నుంచి .. కార్తీక్ తన గ్లౌజులు తీసి ప్రేక్షకులకు అభివాదం చేశాడు.