మన దేశ ప్రధాని నరేంద్రమోదీ దెబ్బకు ఇప్పుడు లక్షద్వీప్ హాట్ టాపిక్ గా మారింది. లక్షలాది మంది టూరిస్టులు ఇప్పుడు లక్షద్వీప్ చూసేందుకు ఎగబడుతున్నారు. అక్కడికి వాయుమార్గం లేదా జలమార్గంలో మాత్రమే వెళ్లాలి. ఇక్కడికి వెళ్లాలంటే ముందుగా కేరళలోని కొచ్చి ప్రాంతానికి చేరుకోవాలి. కొచ్చి నుంచి ఓడలు, బోట్లు, విమానాలు, హెలికాప్టర్లు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నుంచి కొచ్చికి నిత్యం విమాన సర్వీసులు నడుస్తున్నాయి.