పురాణాల ప్రకారం మన విశ్వంలో ఉన్న అన్ని అస్త్రాల కంటే అతి శక్తివంతమైనదిగా మహా పాశుపతాస్త్రం గురించి చెబుతారు. దీనికి ఎదురెళ్తే ఎలాంటిదైనా కూడా నాశనమై బూడిదగా మిగిలిపోతుందని అంటారు. దీన్ని పొందాలంటే సాక్షాత్తూ ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఉండాలి. మహాభారత కాలంలో అర్జునుడు ఆ పరమేశ్వరుని ప్రార్థించి ఈ పాశుపతాస్త్రాన్ని పొందారు. కానీ ఎక్కడా దానిని ఉపయోగించే అవసరం అర్జునుడికి రాలేదు.