AP: రేపు, ఎల్లుండి ఎండ ప్రభావం చూపనున్నట్లు APSDMA వెల్లడించింది. రేపు 149 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 160 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇవాళ తిరుపతి(D) సత్యవేడులో 41.9, నెల్లూరు(D) మనుబోలులో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొంది. వడగాల్పులు వీచే మండలాల వివరాలకు లింక్: bit.ly/4bzLIPl