తమిళనాడులోని తిరుతంగల్ ప్రాంతంలో తాజాగా విషాద ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన భర్త, భార్య, కుమారుడు, కుమార్తె, 2 నెలల మనవడు సహా ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు జరిపిన విచారణలో అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కన్నీటి ఛాయలు అలముకున్నాయి.