గుజరాత్లోని బనస్కాంత జిల్లాలో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.8గా నమోదైంది. భూకంప కేంద్రాన్ని దంతివాడ తాలూకాలోని డెరి గ్రామంలో 3.3 కిలోమీటర్ల లోతులో నమోదైనట్లు అధికారులు గుర్తించారు. భూకంపం వల్ల ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.