ఐపీఎల్ 2025లో భాగంగా శనివారం రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ జట్టుకు మొదటి ఓవర్లోనే షాక్ తగిలింది. తొలి ఓవర్లోనే PBKS రెండు వికెట్లు కోల్పోయింది. పంజాబ్ ఓపెనర్ ప్రియాంష్ ఆర్య (0), కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 10 పరుగులకు ఔట్ అయ్యారు. జోఫ్రా ఆర్చర్ వేసిన మొదటి ఓవర్ మొదటి బంతికి ప్రియాంష్ ఆర్య, చివరి బంతికి శ్రేయాస్ బౌల్డ్ అయ్యారు. దీంతో మొదటి ఓవర్కు PBKS స్కోర్ 11/2గా ఉంది.