ముందుమాట మార్చకుండా పాఠ్య పుస్తకాలను ముద్రించడం వివాదాస్పదమవడంతో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 1-10వ తరగతి విద్యార్థులకు పంపిణీ చేసిన పాఠ్యపుస్తకాలు, వర్క్బుక్లను వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. విద్యాశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డిని పేర్కొంటూ అప్పటి అధికారుల పేర్లతో పుస్తకాలను ముద్రించడంపై విమర్శలొచ్చిన విషయం తెలిసిందే.