మహారాష్ట్రలోని పాల్గర్ జిల్లాలో ఇద్దరు దొంగలు చోరీకి విఫలయత్నం చేశారు. ఇద్దరు దుండగులు తుపాకీ తీసుకొని ఓ నగల షాపులోకి ప్రవేశించబోయారు. గమనించిన షాపు యజమాని బెదరకుండా ఐరన్ రాడ్డు తీసుకొని వారిపైకి దూసుకెళ్లాడు. దీంతో భయపడిపోయిన దుండగులు షాపుపైకి రాళ్లతో దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.