బిహార్లోని పలు జిల్లాల్లో 8 మంది పిడుగుపాటుకు మృతి చెందడటంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. జహ్నాబాద్లో ముగ్గురు, మాధేపురలో ఇద్దరు, ఈస్ట్ చంపరాన్, రోహ్టాస్, శరణ్, సుపౌల్లో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాత పడినట్టు సీఎంఓ కార్యాలయం శనివారం తెలిపింది.