ఎగ్జిట్ పోల్స్ ఫేక్‌: అరవింద్ కేజ్రీవాల్

25052చూసినవారు
ఎగ్జిట్ పోల్స్ ఫేక్‌: అరవింద్ కేజ్రీవాల్
శ‌నివారం విడుదలైన ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నిఫేక్‌ అని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారు. ఈవీఎంలను తారుమారు చేసేందుకే ఫలితాలకు మూడు రోజుల ముందు ఎగ్జిట్‌ పోల్స్‌ను విడుదల చేశారని ఆయన విమర్శించారు. ఆదివారం జైలులో సరెండర్‌ అయ్యేందుకు ముందు ఆమ్‌ ఆద్మీ పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడారు. ఎగ్జిట్స్‌ పోల్స్‌ ఏకపక్షంగా వెలువడ్డాయని కేజ్రీవాల్‌ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్