మహారాష్ట్రలోని ఔసా తుల్జాపూర్ హైవేపై ఆశివ్ వద్ద ఇటీవల ఘోర ప్రమాదం జరిగింది. హైవేపై ఓ వాహనం నిలిచిపోయింది. దానిని ఓ కారు వేగంగా వెళ్లి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న యువకుడు చనిపోయాడు. మృతుడిని లాతూర్ జిల్లా ఉద్గీర్ పట్టణానికి చెందిన మాజీ మేయర్ రాజేశ్వర్ నీతూరే కుమారుడు ప్రసాద్ నీతూరేగా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.