మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాందేడ్-నాగూర్ హైవేపై వేగంగా దూసుకొచ్చిన స్కార్పియో అదుపుతప్పి డివైడర్ను దాటి అవతలి రోడ్డుపై వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.