సంగారెడ్డి జిల్లా పటాన్చెరు (M) పాశమైలారంలోని రెండు ఫార్మా కంపెనీల్లో అగ్ని ప్రమాదం జరిగింది. వనమాలి, సాలుబుర్స్ ఫార్మా కంపెనీల్లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదం జరగడానికి గల కారణం తెలియాల్సి ఉంది.