ఇండియా కూటమి తరపున మల్లికార్జునఖర్గేను ప్రధానిని చేయాలని పలు పార్టీల నేతలు ప్రస్తావిస్తుంటే.. సీఎం సిద్దరామయ్య మాత్రం రాహుల్గాంధీ కావాలని వ్యాఖ్యానించడం ఆయన సంకుచిత స్వభావానికి నిదర్శనమని జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి మండిపడ్డారు. శనివారం బెంగళూరు పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దళిత సమాజానికి చెందిన వారు దీనిని పరిశీలించాలన్నారు.