అసోంలోని దిబ్రూగఢ్ జిల్లాలో నామ్రూప్ థర్మల్ పవర్ స్టేషన్ ప్రాంగణంలో 25 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుకు సీఎం బిస్వ శర్మ శంకుస్థాపన చేశారు. 2021లో సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పుడు.. రాష్ట్రంలో పీక్-అవర్ విద్యుత్ డిమాండ్ 1,800 మెగావాట్లు మాత్రమే ఉందని తెలిపారు. కానీ పారిశ్రామిక వృద్ధి, రాష్ట్రవ్యాప్తంగా గతంలో విద్యుత్ లేని గ్రామాల విద్యుదీకరణ కారణంగా ఈ డిమాండ్ 2,500 మెగావాట్లకు పెరిగిందని చెప్పారు.