అచ్చంపేట డివిజన్ పరిధిలోని బల్మూర్ మండలం మహాదేవ పూర్ గ్రామ సమీపంలో భగీరథ త్రాగు నీరు వృధాగా పోతుంది. గత రెండు రోజులుగా వాటర్ ట్యాంక్ నిండి వాటర్ వృధాగా రోడ్డు మీద ప్రవహిస్తున్న కూడా ఎవరు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోయారు. సంబధిత అధికారులు దీనిపై వెంటనే చర్య తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.