తిప్పారెడ్డిపల్లి గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహణ

55చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం పరిధిలోని తిప్పారెడ్డి పల్లి గ్రామంలో శనివారం పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని వీధుల్లో పిచ్చి మొక్కలను తొలగించారు. సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా, దోమలను నివారించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కార్యదర్శి ఖాజా సజావుద్దీన్ తెలిపారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి సుజావుద్దీన్, ఆశ వర్కర్ లక్ష్మమ్మ, ముస్తఫా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్