మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచారం

84చూసినవారు
మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచారం
AP: బాపట్ల జిల్లాలో మైనర్ బాలికపై సామాహిక అత్యాచార ఘటన కలకలం రేపింది. నిజాంపట్నం మండలంలో 16 ఏళ్ల బాలికపై ఐదుగురు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. వేమూరు మండలానికి చెందిన బాలిక.. శుక్రవారం తన అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. అదే రోజు రాత్రి ఆ బాలికను గ్రామ శివారులోని తోటల్లోకి తీసుకెళ్లి దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులంతా బాలిక స్వగ్రామానికి చెందిన వారేనని పోలీసులు తెలిపారు. ఘటనపై పోక్సో కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్