పాకిస్థాన్‌తో మ్యాచ్.. రోహిత్ ఏమన్నారంటే?

69చూసినవారు
ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ సమయంలో పాకిస్థాన్‌తో మ్యాచు అనగానే ఎలాంటి ఒత్తిడి ఉందో ఇప్పుడు అలాగే ఉందని భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. ప్రత్యర్థి, పిచ్ సమస్య కాదని ఎక్కడైనా మంచి క్రికెట్ ఆడటం ముఖ్యమని మీడియాతో చెప్పారు. టీ20ల్లో ప్రతి ఓవరుకు మ్యాచ్ మారుతుందన్నారు. NYలో పరిస్థితులకు అనుగుణంగా ఆడాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈవాళ రాత్రి 8 గంటలకు భారత్, పాక్ మధ్య మ్యాచ్ జరగనుంది.

సంబంధిత పోస్ట్