మృతదేహాన్ని మాయం చేయమని రూ.30 లక్షలు ఇచ్చా: దర్శన్‌

58చూసినవారు
మృతదేహాన్ని మాయం చేయమని రూ.30 లక్షలు ఇచ్చా: దర్శన్‌
ప్రముఖ కన్నడ నటుడు దర్శన్‌ తన అభిమాని రేణుకాస్వామి హత్య అనంతరం మృతదేహాన్ని ఎవరి కంట పడకుండా మాయం చేసేందుకు మరో నిందితుడైన ప్రదేశ్‌కు రూ.30 లక్షలు ఇచ్చినట్లు స్వయంగా దర్శన్‌ అంగీకరించాడు. ఈ విషయాన్ని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ కేసులో దర్శన్‌ సహా 17 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. హత్యకు ముందు రేణుకాస్వామిని చిత్రహింసలకు గురిచేసి, కరెంట్ షాక్ ఇచ్చారని తేలింది.

సంబంధిత పోస్ట్