పెంపుడు కుక్క మరణించడంతో ఆ బాధ తట్టుకోలేక ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తాజాగా హర్యానాలో జరిగింది. దాదాపు ఐదు రోజులుగా నిద్రహారాలు మానేసి ఏడుస్తూ కూర్చున్న బాలిక చివరికి శనివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరేసుకుని చనిపోయింది. తల్లి, సోదరి కిరాణా సరుకుల కోసం దుకాణానికి వెళ్లి వచ్చే లోపే ఈ దారుణానికి పాల్పడింది. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.